బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగానున్న తెలుగు ప్రజలంతా గర్వంగా చెప్పుకునే వ్యక్తి అయిన పీవీ సేవలను గుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పీవీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఉన్న కాలంలో దేశాభివృద్థికి పీవీ ఎలనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలను గుర్తించి భారత రత్న అవార్డు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. |