రాజీనామా డ్రామా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇకనైనా మారాలని ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచించారు. విమర్శలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించుకుంటే కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెరాస మనుగడ కోసం ఉమ్మడి నాయకత్వం కావాలని వినోద్కుమార్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్లపై అసమ్మతి వాదుల విమర్శలను స్వీకరిస్తామని, సమిష్టి నిర్ణయాలను గౌరవించకపోతే అధ్యక్షుని మార్పు తప్పదని వినోద్ కుమార్ వెల్లడించారు.తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కృషి చేస్తామని, మహాకూటమితో పొత్తు పెట్టుకోవడంతోనే తెరాసను ప్రజలు విశ్వసించలేదని వినోద్ కుమార్ తెలిపారు. |