ప్రజారక్షణ కమిటీని వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర భద్రతా సలహాదారు ఛైర్మన్గా కేవీపీ నియామకాన్ని ఆయన తప్పు పట్టారు.
అధికార దురహంకారంతోనే బ్యాంక్ మేనేజర్పై మంద జగన్నాథం దాడికి పాల్పడ్డారని నారాయణ వ్యాఖ్యానించారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా రక్షణ కమిటి రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతుందని నారాయణ అన్నారు.
ఇదిలా ఉండగా.. మహబూబ్ నగర్ బ్యాంక్ మేనేజర్పై దాడికి దిగారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ జగన్నాథాన్ని వివరణ కోరనున్నట్లు న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు.
వాస్తవాలు తెలుసుకుని దీనిపై స్పందిస్తామని మొయిలీ అన్నారు. అంతేగాకుండా యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ విషయానికి సంబంధించి వివరణ కోరినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. |