బ్యాంక్ మేనేజర్పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ జగన్నాథం, ఈ వ్యవహారంపై సదరు బ్యాంక్ మేనేజరుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీల అభివృద్ధి పథకాలను బ్యాంకర్లు అడ్డుకుంటున్నారని జగన్నాథం ఆరోపించారు.
దళిత ఎంపీని అవమానించారని ఆరోపిస్తూ ఉపునుంతల గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవీందర్రెడ్డిపై నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో రవీందర్ రెడ్డిపై, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది.
ఈ వ్యవహారంపై సదరు బ్యాంకు మేనేజర్కు క్షమాపణ చెప్పేది లేదని జగన్నాథం స్పష్టం చేశారు. ఇంకా ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. |