రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వరుణయాగం గురువారం ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం ఉదయం 9 గంటలకు వరుణయాగం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ వరుణయాగం కార్యక్రమం కొనసాగుతుంది. తొలి రోజైన గురువారం ఈ వరుణ యాగానికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ మహావరుణ యాగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, తితిదే ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ వరుణయాగంలో పాల్గొనే భక్తుల కోసం తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. |