రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతున్న మహిళాదాడులను అరికట్టే దిశగా... మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి 1091 అనే ప్రత్యేక టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మహిళా పోలీస్స్టేషన్లలో సిబ్బందిని పెంచడానికి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ర్యాంగింగ్కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. మహిళల రక్షణకు ప్రతి జిలాల్లోనూ మహిళా హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ తెలిపారు. మహిళలపై యాసిడ్ దాడి చేస్తే కనీసం ఏడేళ్లు శిక్ష పడేలా చట్టంలో మార్పులు తేవాలని కేంద్రానికి ప్రతిపాదించినట్లు యాదవ్ వివరించారు. |