ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > తలసానిపై చర్యకు ప్రత్యేక కమిటీ: తెదేపా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తలసానిపై చర్యకు ప్రత్యేక కమిటీ: తెదేపా
తెలుగుదేశం పార్టీలో తుఫాను సృష్టిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై చర్య తీసుకునేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది. ఇందుకోసం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ తలసాని నడుచుకున్న తీరు, వ్యవహార శైలిపై ఒక నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాత తలసానిపై చర్య తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా, గ్రేటర్‌ హైదరాబాద్ నేతలతో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన స్వగృహంలో బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తలసాని గైర్హాజరయ్యారు.

ఈ సమావేశంలో గ్రేటర్‌ ఎన్నికల వ్యూహం, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ వ్యవహారిస్తున్న తీరుపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా తలసానికి షోకాజ్‌ నోటీసు జారీ చేసే అంశంపై చర్చించారు. అంతేకాకుండా, పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకునే వారిని ఉపేక్షించరాదని గ్రేటర్ నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇంద్రకీలాద్రిపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
బాబు గారూ.. చర్చకు సిద్ధమా: జేపీ సవాల్
రాష్ట్ర రాజధానికి వస్తోన్న ఆస్ట్రేలియా బృందం
ష్.. గప్‌ చిప్: నేతలకు బాబు హుకుం!
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తెదేపా జడ్పీటీసీలు