ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కాంగ్రెస్ పార్టీలో ఎవరినిపడితే వారిని తీసుకోం: సీఎం (News| AP News| Congress| CM| Y.S. RajaSekara Reddy| R0ja| Vijaya Shanthi)
కాంగ్రెస్ పార్టీలో ఎవరినిపడితే వారిని తీసుకోం: సీఎం
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీల నుంచి ప్రముఖ సినీ తారలు రోజా, విజయశాంతిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తోన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని బడితే వారిని తీసుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాబలం, సచ్చీలైతే పార్టీ ప్రవేశానికి అర్హతగా పేర్కొన్నారు.
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జ గోపాలకృష్ణారెడ్డి కాంగ్రెస్లోకి చేరనున్న విషయంపై సీఎం మాట్లాడుతూ.. నిప్పులేనిదే పొగరాదని వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమని ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. పార్టీకి తీవ్రంగా కృషి చేసే సత్తా గల నేతలనే తాము పార్టీలోకి తీసుకుంటామని వైఎస్సార్ స్పష్టం చేశారు.