జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » హైదరాబాద్ ఫ్రీజోన్: 19న అఖిపలక్ష సమావేశం (Hyd | Freezone | All party meet | CM | Rosaiah | Supreme court | Review)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఈనెల 19వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.రోశయ్య నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రిసిడెన్షియల్‌ ఆర్డర్‌లో ఫ్రీజోన్‌ అన్న పదమే లేదన్న అంశం ప్రాతిపదికగా రివ్యూపిటిషన్‌ దాఖలు చేయాలని న్యాయనిపుణులు ఈ సమావేశంలో సూచించారు. రివ్యూ పిటిషన్‌తో పాటు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించాలని అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ను కోరాలని కూడా నిపుణులు ముఖ్యమంత్రి రోశయ్యకు సూచించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.