ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ధరల నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం: సీపీఐ (News| AP News| Flood| State Government| CPI| Narayana| Politics)
ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అలాగే రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
బుధవారం హైదరాబాద్లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముగ్దుంభవన్లో సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఇందులో భాగంగా.. వరద, కరవు, సహాయక చర్యలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు 20శాతం అమ్మకానికి అనుమతినిస్తూ జారీచేసిన జీవోను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.