జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కడపలో ఎన్‌కౌంటర్: మావోయిస్టు మృతి (Kadapa| Encounter| Maoist| Police| News| AP News)
Feedback Print Bookmark and Share
 
కడప జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. గాలీవుడ్ మండలం తుమ్మిగుంట వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది.

ఇంకా సంఘటనా స్థలంలో రెండు రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఓ మావోయిస్టు మరణించగా, మరో ఇద్దరు పరారి అయ్యారని పోలీసులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.