ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణా కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు: అందుకే తెరాస స్వీప్ (Congress | Ananta Venkata ramireddy | TRS | By poll | Telangana)
తెలంగాణా కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు: అందుకే తెరాస స్వీప్
తెలంగాణాలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలే కారణమని కాంగ్రెస్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదల అక్కడి నేతల్లో ఏ కోశానా కనబడలేదన్నారు.
ఎవరో ఒకరిద్దరు తప్పించి మిగిలిన నాయకులంతా తెరాస విజయం సాధిస్తేనే బావుంటుందన్న ధోరణిలో పర్యటనలకు దూరంగా ఉన్నారన్నారు. ప్రతిష్టాత్మకమైన ఎన్నికలను తేలికగా తీసుకోవడంతో తెరాసకు అన్ని స్థానాలు, అంత మెజారిటీ వచ్చిందన్నారు.
ఈ ఉపఎన్నికల్లో ఘోర వైఫల్యానికి నాయకత్వ లోటు స్పష్టంగా కనబడుతోందని అన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు ఉరికిన అభ్యర్థి ఒక్కరు కూడా కనబడ లేదన్నారు. ఈ తప్పిదాల వల్లనే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకున్నదన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వేదికపై చర్చించుకుని ముందుకు సాగుతామన్నారు. తెరాస గెలిచినంత మాత్రాన ప్రజలంతా తెలంగాణాకు అనుకూలంగా ఉన్నారని అనుకోవడం పొరపాటనీ, గెలుపు ఓటములు సహజమని ఆయన అభిప్రాయపడ్డారు.