ప్రకాశం జిల్లాలో కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో విషాదం చోటు చేసుకుంది. గిద్దలూరులో జగన్ ఓదార్పుయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నల్లబండ బజార్కు చెందిన యూసుఫ్ భవనంపైకి ఎక్కాడు. భవనంపైకి ఎక్కిన యూసఫ్ విద్యుత్ వైర్లు తగిలి మరణించారు. అలాగే గాయానికి గురైన మరొక వ్యక్తిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అంతకుముందు వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్ర గిద్దలూరులో ప్రారంభమైంది. జగన్ ఓదార్పు యాత్రకు భారీ స్థాయిలో జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తన తండ్రి తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని అన్నారు.