జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు: ఎంపీ లగడపాటి (Students | Telangana | Group-1 | Lagadapati | Venkatrami Reddy | APPSC)
Bookmark and Share Feedback Print
 
ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని వంకగా చూపి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హితవు పలికారు. గ్రూప్-1 పరీక్షలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు చేసిన యత్నాలను ఆయన ఖండించారు.

దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఏపీపీఎస్సీ పోస్టుల్లో 42 శాతం వాటా కేటాయించడం అసాధ్యమన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా వాడుకుంటూ.. వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.

ప్రధానంగా, ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అవినీతిపరుడని, ఆయనను తక్షణం తప్పించాలని డిమాండ్ చేయడం తగదన్నారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏయేడాది ఫిబ్రవరితో ముగుస్తుందన్నారు. ముఖ్యంగా, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ అనంతరం ఆయన రిటైర్ అవుతారని లగడపాటి గుర్తు చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.