ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఇరు ప్రాంత ప్రజలను ఒప్పించాల్సిందేనని లేకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విభజన అంశంపై ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.