అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్ కారును త్వరలో వేలం వేయనున్నారు. సాధారణంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వాడిన వస్తువులు వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రముఖులు వాడిన వస్తువులకు మంచి గిరాకీ ఉంటుంది. అలాగే ఇరాక్ మాజీ అధ్యక్షుడు దివంగత సద్ధాం హుస్సేన్ వాడిన కారును త్వరలోనే వేలం వేయనున్నారు. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ కారు సద్ధాం రాచఠీవీకి తగినట్టుగానే ఉంటుంది.
వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా మారే వ్యవస్థ ఈ కారు సొంతం. ఇటీవల ఇరాక్ ప్రభుత్వం బాగ్దాద్లో వేసిన వేలంలో కాంటినెంటల్ అనే సంస్థ సొంతం చేసుకుంది. ఈ సంస్థ లండన్లో ఈ కారును త్వరలో వేలం వేయనుంది. మొత్తానికి ఈ కారును సంతం చేసుకునే కోటీశ్వరుడు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది.
|