ప్రపంచంలోనే అత్యంత సంపన్న ప్రదేశంగా లండన్లోని కెన్సైన్టెన్ అనే ప్రాంతం పేరుగడించింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపార సాధారణ సగటు ధర రూ.347 కోట్ల రూపాయలు. దీంతో ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు 'లక్ష్మీపుత్రులు' అమిత ఆసక్తి చూపిస్తున్నారు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, మనస్సును దోచే ప్రకృతి అందాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక శోభను చేకూర్చుతున్నాయి.
దీంతో ఈ ప్రాంతంలో నివాసం అత్యంత ఖరీదుతో కూడుకున్నదిగా మారింది. దివంగత మాజీ యువరాణి డయానా కూడా ఈ ప్రాంతంలో ఉండే భవంతిలోనే నివాసముండేది. అంతెందుకు ప్రపంచ ఉక్కుదిగ్గజం లక్ష్మీ మిట్టల్కు ఈ ప్రాంతంలో మూడు భవనాలు ఉన్నాయి.
ఇటీవల ఆయన కుమారుడు కోసం ఒక భవంతిని కోనుగోలు చేయగా, దీని ధర 982 కోట్ల రూపాయలు పలికింది. ఇది ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ప్రపంచం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విశ్లేషించే శుక్లా అనే వెబ్సైట్.. నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
|