తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, కానీ ఏనాడూ మాటమీద నిలబడే అలవాటు చంద్రబాబు నాయుడుకు లేదని జగన్ ధ్వజమెత్రారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అడ్డాగుట్టలో జగన్ మాట్లాడుతూ.. కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం అంశాల్లో చంద్రబాబు మాట తప్పారన్నారు.