ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  అంతర్జాతీయ
 
ఆఫ్ఘన్‌లో బాంబు పేలుడు : 30 మంది హతం
ఆఫ్ఘనిస్థాన్‌‌లోని కొండ ప్రాంతంలో గల మదర్సాలో సంభవించిన బాంబు పేలుడుతో 30 మంది అనుమానిత తీవ్రవాదులు హతమయ్యారు. ఈ బాంబు పేలుడుకు కారణం క్షిపణి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా దాడి జరిగిన విధానంపై భిన్నమైన కథనాలు వెలుగు చూసినట్లు స్థానిక పత్రికలు ఉటంకించాయి.

ఈ విషయంమై ఓ అధికారి మాట్లాడుతూ ఉత్తర వజిరిస్థాన్‌లోని దత్తఖిల్ ప్రాంతానికి దక్షిణంగా గల చిన్నపాటి గ్రామం వైపు నుంచి మదర్సా మీదకు క్షిపణులు ద్వారా దాడి జరిగిందని వివరించారు.

మదర్సాలోని దాదాపు 50 మంది విద్యార్థులు ఈ దాడి వల్ల మరణించారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా క్షిపణి దాడి జరిగిన మాట వాస్తవమేనని, అయితే దాడి లక్ష్యం మాత్రం తీవ్రవాదుల స్థావరమే కానీ మదర్సా కాదని మరో రక్షణ అధికారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మరిన్ని
ఎల్టీటీఈ బోట్ల మునక: 40 మంది మృతి
లక్ష్య సాధనకు పాటుపడాలి: క్యాస్ర్టో
భారత్‌ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్‌ మద్దతు
ఆఫ్గాన్‌ పోరులో మరో వంద మంది హతం
ఇరాక్‌లో ట్రక్కు బాంబు పేలి 75 మంది మృతి
సైన్యాధ్యక్ష పదవి నుంచి వైదొలగాలి: ఖసూరీ