ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
బస్సును ఢీ కొన్న రైలు: 12మంది మృతి
తూర్పు పాకిస్థాన్‌లో బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో 12మంది మరణించారు. అంతేకాకుండా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని పాకిస్థాన్ పోలీసులు తెలియజేశారు. ఈ సంఘటన లాహోర్ సిటీకి సమీపంలోని మురీద్కీ ప్రాంతంలో సంభవించిందని వారు వెల్లడించారు.

రైల్వే ట్రాక్‌ను దాటేందుకు ప్రయత్నించిన బస్సుపై వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసు ఉన్నత అధికారి మహమ్మద్‌ చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వివరాలందించారని తెలిపారు.

వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ విషయమై బస్సు డ్రైవర్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నామని ఆయన అన్నారు. గత 2005 జూలై నెలలో దక్షిణ పాకిస్థాన్‌లో రైళ్లు ఢీకొన్న మరో సంఘటనలో 133 మంది మరణించిన విషయం తెలిసిందే.
మరిన్ని
నవంబరులో షరీఫ్ స్వదేశీ ఆగమనం
పాక్ సైనికుల దాడిలో 195 మంది మిలిటెంట్ల హతం
బుధవారం కోచి చేరనున్న జపాన్ "పీస్ బోట్"
మృత్యువును మోసగించిన ముషారఫ్
పాక్‌లో డిసెంబర్ 27, 28 సాధారణ ఎన్నికలు?
భారత్‌, చైనాలు సహకరించండి: మలేషియా