ఇస్లమాబాద్లో శనివారం పాకిస్థాన్ సైనిక హెడ్క్వార్టర్స్కు సమీపంలో ఆత్మాహుతి దాడి చేయడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ బాంబు పేలుడు ఇస్లామాబాద్లోని రావిల్పిండిలో ఉన్న సైనిక హెడ్క్వార్టర్స్ సమీపంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో సంభవించిందని పేర్కొన్నాయి. ఆర్మీ మేజర్ జనరల్ వషీద్ అర్షద్ మాట్లాడుతూ ఈ బాంబు పేలుడు సంఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు.
|