ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అశువులుబాసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 'ఐర్లాండ్ శాంతి బహుమతి'కి ఎంపికయ్యారు. 2007 సంవత్సరానికి గాను ఆమెకు 'ఐర్లాండ్ టిప్పెరరీ శాంతి పురస్కారం' అందజేయనున్నారు. పాకిస్థాన్లో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు చేసిన కృషికిగాను మరణానంతరం ఆమెను ఈ పురస్కారానికి ఎంపికైనట్టు శాంతి బహుమతి కమిటి ప్రకటించింది.
ఈ శాంతి బహుమతిని గత 1984 నుంచి టిప్పెరరీ పీస్ కన్వన్షెన్ సంస్థ అందజేస్తోంది. ఐర్లాండ్తో పాటు ఇతర దేశాల్లో శాంతి స్థాపనకు కృషి చేసిన దీన్ని బహుకరించడం ఆనవాయితి. గతంలో నెల్సన్ మండేలా, మిఖాయిల్ గోర్బచేవ్, బిల్క్లింటన్లకు ఈ అవార్డును అందజేశారు.
అయితే.. 2007కు గాను బెనజీర్ భుట్టోను ఎంపిక చేశామని, ఈ అవార్డును వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీన టిప్పెరరీ పట్టణంలో జరిగే 'ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ పీస్' కార్యక్రమంలో బెనజీర్ కుటుంబ సభ్యలకు అందజేస్తామని పీస్ కన్వెన్షన్ ప్రతినిధి మార్టిన్ ఖ్విన్ తెలిపారు.
|