ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్వతంత్ర న్యాయ వ్యవస్థ పాక్ లక్ష్యం: గిలానీ
బర్తరఫ్‌కు గురైన న్యాయమూర్తులను పాకిస్థాన్ ప్రభుత్వం తిరిగి నియమిస్తుందని ఆ దేశ ప్రధాని యూసఫ్ రజా గిలానీ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి పాకిస్థాన్ న్యూస్ పేపర్స్ సొసైటీ (ఏపీఎన్ఎస్) ప్రతినిధులతో పాక్ ప్రధాని గిలానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. తొలగించిన న్యాయమూర్తులను తిరిగి నియమించడమే కాకుండా.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేయడమే పాకిస్థాన్ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.

గత ఏడాది నవంబరు మూడో తేదీన దేశంలో విధించిన ఎమర్జెన్సీ కారణంగా న్యాయవ్యవస్థను రద్దు చేసి, న్యాయమూర్తులను గృహనిర్భంధంలో ఉంచిన విషయం తెల్సిందే. అయితే పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక గృహ నిర్భంధంలో ఉన్న న్యాయమూర్తులను విడిపించారు. ప్రతి అంశానికి జాతీయ అసెంబ్లీయే నిర్ణయాత్మక కేంద్రం. దేశంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. దీనికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేస్తోందని చెప్పారు.
మరిన్ని
భుట్టో హత్య కేసుపై పాక్ అసెంబ్లీలో తీర్మానం
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య "మైత్రి" సేవలు
నేపాల్ ప్రధానిగా బాబూరాం భట్టారాయ్..!
ఇరాన్ మసీదులో బాంబు పేలుడు
తొలి దశ ఫలితాలు: అతిపెద్ద పార్టీగా మావోయిస్టులు
ఆ దేశాలు తమ వాదనను వినిపించాలి: రాష్ట్రపతి