సౌదీ అరేబియా పర్యటనకు విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ శనివారం బయలుదేరుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే వివిధ రంగాల్లో సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని భారత్ భావిస్తోంది.
మంత్రి ప్రణబ్ సౌదీ పర్యటన చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. భారత నుంచి అత్యున్నత స్థాయి బృందం మంత్రి ప్రణబ్ వెంట వెళుతుంది. సౌదీ రాజు అబ్దుల్లా 2006లో భారతదేశ పర్యటనకు వచ్చారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో భారత బృందం సౌదీ పర్యటనకు గత ఏడాది వచ్చారు.
సౌదీతో వివిధ రంగాలతో కలిసి పనిచేయాలని భారతదేశం గతంలో అనేక ఒప్పందాలను చేసుకుంది. మంత్రి ప్రణబ్ సౌదీ పర్యటనలో భాగంగా రాజు అబ్దుల్లా, యువరాజు సుల్తాన్, ఇతరులను కలుసుకుని సమావేశం అవుతారు.
|