ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అవినీతి కేసుల నుంచి జర్ధారీకి ఉపశమనం
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కొ-ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్ధారీకి ఉపశమనం లభించింది. ఆయనపై దాఖలై ఉన్న అన్ని అవినీతి కేసులను సింధ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం ఆదేశించింది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబి) జర్ధారీపై పలు అవినీతి కేసులను నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులలో ఒక్కొక్కదాని నుంచి విముక్తి పొందుతూ వస్తున్న జర్ధారీకి మంగళవారం పూర్తి ఉపశమనం లభించింది.

తనపై నమోదైన కేసులను జాతీయ పునఃసమీక్ష చట్టం (నేషనల్ రీ-కన్సిలియేషన్ ఆర్డినెన్స్) కింద ఉప సంహరించాల్సిందిగా కోరుతూ జర్ధారీ సింధ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింధ్ హైకోర్టు.. ఎన్‌ఆర్‌ఓ చట్టం మేరకు కేసులను తొలగిస్తూ ఆదేశించినట్టు జియో టీవీ ఛానల్ పేర్కొంది.
మరిన్ని
ఉగ్రవాద సంస్థలతో దలైలామాకు లింకు: చైనా
ఉప ఎన్నికలను వాయిదా వేసిన పాక్ ఈసీ
మియన్మార్‌ తుఫానులో 13 వేల మంది మృతి
ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా జర్ధారీ..!
29 మంది ఖైదీల విడుదలకు భారత్ సమ్మతం..!
పెను తుఫానుకు 350 మంది మృతి