చైనాలో సంభవించిన భారీ భూకంపంవల్ల మృత్యువాత పడిన వారి సంఖ్య 50 వేలకు చేరుకుందని స్థానిక వార్తా సంస్థ జినూవా ప్రకటించింది. సియాచున్ ప్రావిన్స్ పరిధిలో ఈ భూకంపం సోమవారం సంభవించింది. ఈ ప్రావిన్స్లో 19,509 మంది అశువుల బాశారని అధికారులు నిర్ధారించారు.
భారీ భూకంపంలో 1,02,103 మంది క్షతగ్రాతులుగా మిగిలారని సియాచున్ వైస్ గవర్నర్ లీ చెంగుయున్ చెప్పారు. చైనా ఆర్మీకి చెందిన లక్ష మందితో పాటుగా 1,235 మంది వైద్య బృందాలు రంగంలోకి దిగి బాధితులకు సహాయం అందిస్తున్నాయి. భూకంపం జరిగిన ప్రాంతంలో సహాయ, పునర్మిణాన కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.
|