జమ్మూ కాశ్మీర్లే పేట్రేగుతున్న తీవ్రవాదం ప్రధానాంశంగా భారత-పాకిస్థాన్లు చర్చలు జరుపుతాయని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 21వ తేదీన పాకిస్థాన్ పర్యటనకు వెళుతున్నారు. ఇరుదేశాలకు తీవ్రవాదం నియంత్రణ పెనుసవాలుగా మారుతుందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహ్మద్ సాదిక్ చెప్పారు.
భారతదేశంతో స్నేహబంధాన్ని కొనసాగించాలనేదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. ఈ దఫా జరిగే సదస్సులో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, షా మహ్మద్ ఖురేషీలు వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు.
|