చైనాలో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో అధికారికంగా మరణించిన మృతుల సంఖ్య 22 వేలు. ఈ భూకంపంలో దాదాపు 50 వేల మంది ప్రాణాలు విడిచారని అనధికార లెక్క. స్టేట్ కౌన్సిల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీస్ భూకంపానికి సంబంధించిన అధికారిక మృతుల సమాచారాన్ని తెలిపింది.
సియాచున్ ప్రావిన్స్లో 7.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని వివరించింది. 22,069 మంది ప్రాణాలు కోల్పోగా, 168,669 మంది క్షతగాత్రులుగా మిగిలారు. సియాచున్ ప్రావిన్స్లోనే దాదాపు 21,.500 మంది అశువులు బాశారు. భూకంప బాధితుల సహాయార్ధం అవసరమైన సామాగ్రిని పొరుగు దేశమైన భారత్ పంపించింది.
|