జనరల్ ముషార్రఫ్ తన పదవికి రాజీనామా చేయడంతో పాకిస్థాన్ పార్లమెంట్కు సుప్రీంగా తయారైందని ఆ దేశ ప్రధాన మంత్రి యూసూఫ్ రజా గిలానీ తెలిపారు. ముషార్రఫ్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని తెలిపారు. జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు.
అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడానికి సంకీర్ణంలోని పార్టీలు కసరత్తు చేస్తున్నాయని చెప్పారు. గత యేడు ముషార్రఫ్ తొలగించిన న్యాయమూర్తులను తిరిగి తీసుకునేందుకు సమాలోచనలు జరుగుతున్నాయన్నారు.
ముషార్రఫ్ను అంత సులువుగా దేశం దాటనీయరాదని న్యాయ వర్గాలు అంటున్నాయి. అధికారాలన్ని అధ్యక్షుడికి కట్టబెడుతూ ముషార్రఫ్ చేపట్టిన రాజ్యాంగంలోని 58(2బీ)ను సవరణను రద్దు చేయాలని కోరుతున్నారు. సమాచార శాఖామంత్రి షెర్రీ రెహ్మాన్ మాట్లాడుతూ ముషార్రఫ్ రాజీనామా పెద్ద విజయమన్నారు.
|