రాజకీయ మార్పులు జరుగుతున్న పాకిస్థాన్పై తీవ్రవాదులు కన్నేశారు. అప్పుడు పెషావర్లో మంగళవారం బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో దాదాపు 23 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. అధికార వర్గాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
పాకిస్థాన్ దేశంలో పెషారవర్ ప్రాంతంలోని దేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలోని ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. తెరుకునే లోపే ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 23 మంది మృతి చెందారు.
చాలా మంది క్షతగాత్రులయ్యారు. గాయడ్డవారిని అధికారులు, అక్కడే ఉన్న పలువురు ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు సంఘటనా స్థలాని చేరుకుని సహాయకార్యక్రమాలు చేప్టారు. వివిధ కోణాలలో దర్యాప్తు సాగిస్తున్నారు.
|