ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > భారత్ అందించిన సాక్ష్యానికి పాక్ కట్టుబడాలి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్ అందించిన సాక్ష్యానికి పాక్ కట్టుబడాలి
FILE
భారత్ అందించిన సాక్ష్యాధారాలకు పాక్ కట్టుబడి దేశంలోని ఉగ్రవాదుల పని పట్టాలని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశీ శాఖ సహాయ కార్యదర్శి రిచర్డ్ బౌచర్ ఈ విషయమై పాక్ ప్రభుత్వానికి అమెరికా తరపున గట్టి సందేశాన్ని ఇచ్చారు.

పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ, విదేశీ మంత్రి షా అహ్మద్ ఖురేషిలతో సమావేశమైన అనంతరం ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీలో
బౌచర్ విలేకరులతో మాట్లాడుతూ ఉగ్రవాదులకు పాక్ భూభాగంతో సంబంధం ఉందనే విషయం స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు.

భారత్ అందించిన సమాచారంపై పాక్ పరిశోధించాలని, లభ్యమవుతున్న సాక్ష్యాధారాల బట్టి ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని బౌచర్ పాక్‌కు సూచించారు. భవిష్యత్తులో తన భూభాగంనుంచి ఇలాంటి దాడులకు ఉగ్రవాదులు తలపడకుండా పాక్ జాగ్రత్త వహించాలని బౌచర్ తెలిపారు.

ముంబై దాడులపై భారత్, పాకిస్తాన్‌కు సాక్ష్యాధారాలను అందించిన కొద్ది గంటలలోపే ఉగ్రవాదులపై చర్య గురించి బౌచర్ చేసిన ప్రకటన వెలువడడం గమనార్హం. బుధవారం భారత్ రానున్న బౌచర్, ముంబై దాడులలో అమెరికా దేశస్తులు ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన దృష్ట్యా అమెరికా విచారణపై నేరుగా జోక్యం చేసుకుందని, ఈ దాడులకు బాధ్యులైన వారిని పట్టుకోవాలని భావిస్తోందని బౌచర్ తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భారత్ అందించిన సాక్ష్యాధారాల్లో పసలేదు: పాక్
నాజీల వ్యూహానికి దీటుగా టైగర్ల ఎత్తుగడలు
ముల్లైతీవులో భీకర పోరు: 40 మంది సైనికుల బలి
ప్రభాకరన్ అప్పగింతపై నిర్ణయించుకోలేదు
పాక్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
గాజాపై దాడుల కొనసాగింపు : 510మంది మృతి