పాకిస్థాన్లోని ఆఫ్గనిస్థాన్ సరిహద్దులో కబిలాయి ప్రాంతంలో అమెరికా డ్రోన్ ద్వారా జరిపిన మిస్సైళ్ళ దాడులతో 15మంది మృతి చెందారు. అధికులు గాయాలపాలైనారు.
ఉత్తర వజీరిస్థాన్ కబిలాయి ప్రాంతంలోని ప్రధాన పట్టణం మిరాలివద్ద ఓ కుగ్రామంలోని ఇంటిపై ఏకంగా మూడు మిసైళ్లు దాడిచేశాయి. ఈ దాడులు జిరిగినప్పుడు కొంతమంది విదేశీయులుకూడా ఉన్నట్లు సమాచారం.
ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇందులో ఉగ్రవాదులతోబాటు ఏడుమంది మృతి చెందారు. ఐదుమంది గాయాలపాలైనారు.
కాగా రెండవసారి జరిగిన దాడిలో ఒక డ్రోన్ ద్వారా దాదాపు రెండు మిస్సైళ్ళు దక్షిణ వజీరిస్థాన్ ఏజెన్సీపై దాడికి పాల్పడగా ఇందులో ఇద్దరు పిల్లలతోబాటు దాదాపు ఎనమిది మంది మృతి చెందినట్లు సమాచారం. |