ఫిలిస్తీన్ సమాజంలో ఇస్లాం కోర్టులలో ఇప్పుడు మహిళా మణులుకూడా జడ్జీలుగా నియమింపబడ్డారు. ఖులాద్ ఫాకిహ(34), అసమ్హాం వుహైదీ(31)లు ఆ ప్రాంతంలో తొలి న్యాయాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు.
అరబ్బుల సామ్రాజ్యంలో కేవలం సూడాన్లో మాత్రమే ఇస్లాం కోర్టులలో మహిళలు జడ్జీలుగా వున్నారు. లెబనాన్, సిరియా, జార్డాన్ ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితి లేదు.
మేము చేసింది మంచిదేనని ఇది ఇతర ముస్లిం మహిళలకు ఎంతో లాభదాయకం కాగలదని ఫాకిహ అభిప్రాయపడ్డారు. కుటుంబ సమస్యలు, విడాకులు, అధికారాలు, సంరక్షణ బాధ్యతలు తదితరాలన్నీకూడా చట్టానికి లోబడి ఇస్లాం చట్టాలున్నాయని, వాటిని సమర్థవంతంగా అమలు చేసి, మహిళలకు న్యాయం చేస్తామని ఆమె అభిప్రాయపడ్డారు. |