భారత్ను అంతర్జాతీయ శక్తిగా అధ్యక్షుడు బారక్ ఒబామా భావిస్తున్నారంటూ అమెరికా పేర్కొంది. అందుకే భారత్తో నిర్మాణాత్మక సంబంధాలను ఏర్పరుచుకోవడం ద్వారా 21 శతాబ్ధంలో ఎదురుకానున్న అంతర్జాతీయ సవాళ్లతోపాటు, స్థానిక సమస్యలను సైతం పరిష్కరించవచ్చని ఒబామా భావిస్తున్నట్టు అమెరికా పేర్కొంది.
ఈ విషయమై దక్షిణాసియా సంబంధాల సహాయ కార్యదర్శి రాబర్ట్ బ్లాక్ మాట్లాడుతూ విదేశీ సంబంధాల కమిటీ సమావేశం సందర్భంగా భారత్తో సంబంధాల గురించి చర్చ జరిగినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ భారత్ను అంతర్జాతీయ శక్తిగా గుర్తించడంతో పాటు అమెరికాకు సంబంధించి అతి ముఖ్యమైన భాగస్వామిగా గుర్తించినట్టు చెప్పారని బ్లాక్ పేర్కొన్నారు.
21వ శతాబ్ధంలోని సవాళ్లను భారత్తో కలి మాత్రమే ఎదుర్కోగలమని కూడా ఒబామా చెప్పినట్టు ఆయన వివరించారు. దీని ప్రకారం భారత్, అమెరికాల మధ్య నిర్మాణాత్మకమైన సంబంధాలను పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. |