ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత్లో మరిన్ని దాడులు జరగొచ్చు: ఇజ్రాయేల్ (Jerusalem | Pakistan | Lashker-e-Taiba | Mumbai attacks | India | Jammu and Kashmir)
నిరుడు నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడుల తరహాలో మరిన్ని దాడులు భారతదేశంలో జరిగే సూచనలున్నట్లు ఇజ్రాయేల్ దేశం అనుమానాలు వ్యక్తం చేసింది.
ప్రపంచంలోనే అత్యున్నతమైన ఉగ్రవాద సంస్థ లష్కరే-తొయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు భారత దేశంలో నిరుడు ముంబైలో జరిపిన దాడుల తరహాలోనే మళ్ళీ ఆ దేశంలో దాడులు జరిపే సూచనలున్నట్లు ఇజ్రాయేల్ ఉగ్రవాద నిరోధక సంస్థ శుక్రవారం అనుమానం వ్యక్తం చేసింది.
ముఖ్యంగా దేశంలోని ఉత్తర భాగమైన జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాలలో సంఘవిద్రోహక చర్యలకు పాల్పడేందుకు కృషి చేస్తున్నట్లు తమవద్ద సమాచారం ఉందని ఆ దేశం ప్రకటించింది. దీంతో భారతదేశం అప్రమత్తంగా ఉండాలని కూడా ఇజ్రాయెల్ దేశం హెచ్చరించింది.