ఉత్తర చైనాలోని హేబేయీ ప్రాంతంలో ఓ ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్ళింది. దీంతో అక్కడికక్కడే 19 మంది మృతి చెందారు.
ఉత్తర చైనాలోని హేబేయీ ప్రాంతంలో ఓ ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్ళింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారని, మరో 13 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక భద్రతాధికారి ఒకరు తెలిపారు
ట్రక్కు బ్రేకులు పెయిల్ అవడంతో ఈ దుర్ఘటన జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు స్థానిక పోలీసులు వివరించారు. దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించామని ఆయన అన్నారు.
ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు ట్రక్కు యజమానిని అదుపులోకి తీసుకున్నామని దుర్ఘటనకు సంబంధించి విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.