భారతదేశానికి చెందిన మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.
ముందస్తు అనుమతి లేకుండా తమ సముద్ర జలాలలోకి ప్రవేశించారంటూ దాదాపు 13 మంది భారత మత్స్యకారులను పాకిస్థాన్ భద్రతా దళాలకు చెందిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వీరితోపాటు వారు ఉపయోగించిన మూడు పడవలను కూడా పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుతం తమ ఉన్నతాధికారులు వారిని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.