| ఇంకా చదవండి |
| తమ పార్టీ అధినాయకత్వానికి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరిస్తూ కేంద్ర కేబినెట్ మంత్రి, అరకు ఎంపీ వి.కిషోర్ చంద్రదేవ్ లేఖ రాసినట్టు వచ్చిన మీడియాలో వచ్చిన వార్తలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొట్టిపారేశారు. ఇవి కేవలం పుకార్లేనని అభిప్రాయపడ్డారు. బొత్సను లిక్కర్ మాఫియా డాన్గానూ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అసమర్థ సీఎంగా పేర్కొంటూ కాంగ్రెస్ అధినాయకత్వానికి కిషోర్ చంద్రదేవ్ గతంలో లేఖ రాయగా, ఇది ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో అలజడి అరంభమైంది. | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి వంద ఎకరాల భూమిని కానుకగా సమర్పిస్తున్నట్లు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. తమ ఇలవేల్పు అయిన శ్రీవారికి ఎప్పటి నుంచో కానుకలు సమర్పిస్తున్నానని, ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో ఇప్పటికే సమర్పించిన భూమితో పాటు మరో వంద ఎకరాలను విరాళంగా అందిస్తున్నట్లు రాయపాటి విలేకరుల సమక్షంలో ప్రకటించారు. |