ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  జాతీయ
 
కూలిపోయిన జస్వంత్ సాగర్ డ్యామ్
గత కొద్దిరోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో గల జస్వంత్‌ సాగర్ డ్యామ్ కూలిపోయింది. దీంతో సమీపంలోని నలభై గ్రామాలు ప్రమాదపుటంచున ఉన్నాయి.

118 సంవత్సరాల వయస్సున్న ఈ డ్యామ్‌ ఇటీవలి వర్షాలకు బీటలు వారింది. జోద్‌పూర్, పాలి జిల్లాలు వరద తాకిడికి గురి కావడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. సైన్యం రంగ ప్రవేశం చేసి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. రోడ్డు సంబంధాలు తెగిపోయాయి.

దీంతో జోద్‌పూర్, జైపూర్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి నలభై గ్రామాలు ప్రజలు వరద తాకిడికి గురయ్యారు. ఈ ప్రాంత పరిథిలోని బర్మర్ జిల్లాలో 2006లో సంభవించిన వరదలకు దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని
ప్రపంచ ఏడు వింతల ప్రకటన నేడే
ప్రణబ్ ఇతోపియా పర్యటన ఫలవంతం
రాష్ట్రపతి ఎన్నికపై త్వరలో నిర్ణయం: తృణమూల్
పరిష్కారం దిశగా సరిహద్దు వివాదం: ప్రధాని
అద్వానీ లేఖను తిరస్కరించిన ఎన్నికల సంఘం
ఉగ్రవాద సమస్యపై ఇంగ్లండ్‌తో మాట్లాడా: ప్రధాని