ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  జాతీయ
 
బోరుబావిలో పడిపోయిన బాలుడు మృతి
బోరుబావిలో పడిపోయిన రాజస్థాన్ బాలుడు సూరజ్ బంజారా శుక్రవారం రాత్రి మృతి చెందాడు. బోరుబావి నుంచి వెలికి తీయడానికి దాదాపు 50 గంటలు తీవ్రంగా ప్రయత్నించి చివరికి వెలికి తీసినా ఫలితం లేకపోయింది.

అందరినీ ఉత్కంఠకు గురి చేసిన ఈ సంఘటన చివరకు విషాదాంతమైంది. బాలుడు బోరు బావిలో పడిపోయాడన్న విషయం తెలుసుకుని స్పందించిన సైనిక, పౌర విభాగానికి చెందిన సిబ్బంది బాలుడిని వెలికి తీయడానికి తీవ్రంగా కృషి చేశారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయక వెలికి తీసే ప్రయత్నాలు చేశారు.

వెలికి తీసిన అనంతరం వైద్యులు సూరజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. రాజస్థాన్‌లోని నిమేడా గ్రామంలో రోజువారీ కార్మికుడి కుమారుడైన సూరజ్ బుధవారం మధ్యాహ్నం ఆడుకుంటూండగా సమీపంలోని బోరుబావిలోకి జారి పడిన విషయం తెలిసిందే.
మరిన్ని
ప్రతిభకు కో-ఆపరేటివ్ బ్యాంకుల సమాఖ్య క్లీన్ చిట్
కూలిపోయిన జస్వంత్ సాగర్ డ్యామ్
ప్రపంచ ఏడు వింతల ప్రకటన నేడే
ప్రణబ్ ఇతోపియా పర్యటన ఫలవంతం
రాష్ట్రపతి ఎన్నికపై త్వరలో నిర్ణయం: తృణమూల్
పరిష్కారం దిశగా సరిహద్దు వివాదం: ప్రధాని