07.07.07 న ప్రపంచంలో కొత్తగా ఎంపిక కానున్న ఏడు వింతలు ఏమిటా అని ప్రపంచ మానవాళి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎప్పుడో 2 వేల ఏళ్ల క్రితం గ్రీకులు ప్రపంచంలోని ఏడు వింతలను గర్తించారు. అయితే అప్పుడు వారికి దృష్టికి వచ్చిన వింతలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారన్న వాదనలు సైతం జోరందుకున్నాయి.
ఏదైతేనేం తాజ్మహల్ ఏడు వింతలలో చోటు దక్కించుకోవటం ఖాయం అన్న ప్రచారం జోరందుకుంది. భారతదేశం నుంచి తాజ్ ఏడు వింతల్లో బెర్తును సాధించి తీరుతుందన్న నమ్మకం ఓటింగ్ సరళిని చూస్తే తెలుసుకోవచ్చని అభిమానులు అంటున్నారు. తాజ్ ఏడు వింతల్లో చోటు దక్కించుకుని 'వహ్ తాజ్' గానే కాక 'వండర్ తాజ్మహల్' అవుతుందని మనమూ కోరుకుందాం.
|