దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 24 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఢిల్లీలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకొంది. కార్కాదూమాలో ఉన్న కేంద్రీయ విద్యాలయకు చెందిన బస్సు తూర్పు ఢిల్లీలోని ప్రీతీవిహార్ ప్రాంతంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో సులేమాన్ (50) అనే గార్డియన్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు గాయపడగా, 18 మంది విద్యార్థుల పరిస్థితి సాధారణంగానే ఉంది. కానీ మిగిలిన ఆరుగురు విద్యార్థులు ఢిల్లీలోని మూడు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సు బోల్తా పడిన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
|