బాలీవుడ్ నటుడు సంజయ్దత్ దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిలు పటీషన్పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరిపి, సీబీఐకు నోటీసు జారీ చేసింది. బెయిలుపై పిటీషన్ విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు. వచ్చే ఆగస్టు 20వ తేదీన ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి కేజి.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
అంతకుముందు సంజయ్దత్ తరపు న్యాయవాది ఫాలీ ఎస్.నారిమాన్ వాదిస్తూ.. దత్ పిటీషన్ వ్యవహారాన్ని అత్యవసరంగా చేపట్టాలని కోరగా, ప్రధమ ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఇదే కేసులో శిక్ష పడిన మరికొంత మంది ముద్దాయిలు కూడా బెయిల్ కోరుతూ పిటీషన్లు దాఖలు చేశారు.
|