ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
గురువారం ఢిల్లీకి సోనియా తిరుగుపయనం
దక్షిణాఫ్రికా పర్యటన నిమిత్తం బయలుదేరిన యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ గురువారం ఢిల్లీకి పయనం కానున్నారు. స్వదేశంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోనియా తన పర్యటనను మూడు రోజులకు కుదించుకున్నట్లు భారత విదేశాంగ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు డర్బన్‌లో పాల్గొనాల్సిన పలు కార్యక్రమాలను సోనియా రద్దు చేసుకున్నారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా పర్యటన పవిత్రయాత్ర వంటిదని సోనియా చెప్పారు.

మండేలాను కలువకుండా వెనుదిరిగితే ఆ యాత్ర అసంపూర్తిగా ముగిసినట్లేనని సోనియా అన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీపై రచించిన "గాంధేయమార్గం" పుస్తకాన్ని మండేలాకు అందజేశారు. మంగళవారం విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ శర్మతో సోనియాగాంధీ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే.
మరిన్ని
ఎరవాడ జైలు నుంచి సంజయ్‌దత్ విడుదల
యూపీఏ సుస్థిరతకు భంగం వాటిల్లదు: లాలూ
వ్యక్తిగత కార్యదర్శి హత్య కేసు నుంచి శిబుసొరేన్‌కు విముక్తి
ఐఏఈఏ సమావేశానికి భారత్ హాజరుకావచ్చు: ఏచూరీ
ఐఏఈఏ సమావేశానికి హాజరవుతాం: కాంగ్రెస్
నేడు సీపీఎం కేంద్ర కమిటీ కీలక సమావేశం