కర్ణాటకలోని జనతాళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన భారతీయ జనతా పార్టీ ఆదివారం నాడు గవర్నర్ను కలసి తన నిర్ణయం తెలుపనుంది.
భాజపా శాసనసభా పక్షనేత యడియూరప్ప నేతృత్వంలోని ఆ పార్టీ శాసనసభా పక్ష బృందం ఆదివారం గవర్నర్ రామేశ్వర్ ఠాకుర్ను కలిసి, తమ మద్దతు ఉపసంహరణ లేఖను అందజేస్తారు.
భాజాపా పార్లమెంటరీ బోర్డు శనివారం ఢిల్లీలో సమావేశమై ముఖ్యమంత్రి కుమార స్వామి నాయకత్వంలోని కర్ణాటక సర్కారుకు మద్ధతు ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలు తప్పితే మరోమార్గం లేదని భాజపా అభిప్రాయపడింది. మరోవైపు ఎన్నికలకు తాము సిద్ధమని కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) పార్టీలు తెలిపాయి.
కాగా ఈ నెల 18వ తేదిన జరిగే బలపరీక్ష తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగా భాజపాకు అధికార బదీలీ జరపకపోవటానికి కారణాలు ప్రజలకు తెలియజేస్తానని ముఖ్యమంత్రి కుమార స్వామి పేర్కొన్నారు.
|