గుజరాత్లో మంగళవారం అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు జరగిన ఈ ఓటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు
ఈ తొలి దశ ఎన్నికలలో సుమారు 60 శాతం మేర వరకు ఓట్లు పోల్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, అందులో 87 స్థానాలకి ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన 87 స్థానాల్లో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో 58 స్థానాలుండగా, 29 స్థానాలు దక్షిణ గుజరాత్లో ఉన్నాయి.
సుమారు 53 మంది మహిళా అభ్యర్ధులతో సహా మొత్తం 669 మంది అభ్యర్ధులు పోటీపడ్డ తొలి దశ ఎన్నికలలో మంగళవారం సుమారు 1,78,77,771 మంది ఓట్లు పోల్ అయ్యాయి. కాగా, మొత్తం 19,924 పోలింగ్ బూత్లలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ యంత్రాలను ఓటింగ్ కోసం వినియోగించారు.
|