ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తులిప్ గార్డెన్‌ను ప్రారంభించనున్న సోనియా
శ్రీనగర్‌లోని సుమారు 60 రకాల పువ్వులతో ఆసియాలోనే అతి పెద్ద మెగా ఫ్లవర్ గార్డెన్‌గా పేరొందనున్న సిరాజ్‌బాగ్ వద్ద ఉన్న తులిప్ గార్డెన్‌ను యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ శనివారం ప్రారంభించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

దాల్ సరస్సుకు సమీపంలోని జబర్వన్ కొండ ప్రాంతం వద్ద ఈ గార్డెన్ ఉంది. వాస్తవానికి ఆ గార్డెన్‌ను వచ్చే నెలలో ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే పుష్పాలు ముందుగానే సంపూర్ణ పరిణత స్థితికి చేరడంతో ఈ నెలలోనే ఆవిష్కరించాలని నిశ్చయించారు.

ఐదు హెక్టార్ల విస్తీర్ణంలోని సుమారు 60 రకాలలో ఇప్పటికే పుష్పించినవి, పుష్పిస్తున్నవి.. ప్రాథమిక దశలో ఉన్నవి గార్డెన్‌కు అందాన్ని ఇస్తున్నాయి. అలాగే ఎరుపు, నారింజపండు రంగు, తెలుపు, పింక్, పసుపు తదితరమైన రంగుల్లోని పుష్పాలు ఆ ప్రాంతంలో పరిచినట్లుండటం మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి.

ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్‌ సృష్టిరూపమైన ఈ గార్డెన్ స్థానికంగా సిరాజ్‌బాగ్‌గా సుపరిచితమైనది. ఇక్కడ సుమారు 400 మంది కూలీలు, 150 మంది గార్డెనర్‌లు ప్రస్తుతం ఇక్కడి పుష్పాల అందాలను పరిశీలిస్తుంటారు.
మరిన్ని
కాశ్మీర్‌లో గ్రామీణ అందాల కోసం రూ.1200 కోట్లు
అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది: రాహుల్
ప్రత్యక్ష ఎన్నికల పోటీకి గుడ్‌బై: పవార్
మూడో కూటమి ఎన్నికల స్టంట్: బర్ధన్
గాంధీ పేరు లేకుంటే కష్టమే: రాహుల్ ఒప్పుకోలు
ఐరాసలో భారత్‌ శాశ్వత సీటుకు బ్రిటన్ ఒకె!