ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జైపూర్‌లో వరుస బాంబుపేలుళ్లు
రాజస్థాన్ రాజధాని జైపూర్‌ మంగళవారం సాయంత్రం జరిగిన వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఈ సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారని సమాచారం. పర్యాటకులు ఎక్కువగా సంచరించే జోహ్రి బజార్, సాంగనేర్ గేట్, మానిక్ చౌక్‌లోని హనుమాన్ మందిర్, ట్రిపోలియా బజార్‌లలో ఈ పేలుళ్లు జరిగాయి.

పేలుడు వివరాలు తెలుసుకున్న రాజస్థాన్ డీజీపీ ఆయా ప్రాంతాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అజ్మీర్ పేలుళ్లు జరిగిన ఏడు నెలలు తర్వాత ఈ దాడి జరగటం గమనార్హం. దాడిలో భారీ విధ్వంసాన్ని సృష్టించే పేలుడు పదార్ధాలను వినియోగించారని ప్రాథమిక సమాచారం.

పేలుడును దృష్టిలో పెట్టుకుని దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబయిలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హై అలెర్ట్‌ను రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని
రెండో దశ ఎన్నికల ప్రచారంలో సోనియా
అమర్‌సింగ్ ఆరోపణలు కొట్టేసిన సీపీఎం
ఆకట్టుకున్న పర్యాటక ఉత్సవాలు  
నందిగ్రామ్‌పై నివేదిక కోరిన హోంశాఖ
గోవధకారులను క్రిమినల్స్‌గా పరిగణించాలి
పేలిన మందు పాతరలు: పాటిల్‌కు తప్పిన ప్రాణగండం