ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చైనా భూకంప బాధితులకు కేంద్రం సాయం  Search similar articles
చైనా భూకంప బాధితులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. బాధితుల కోసం ఐదు మిలియన్ డాలర్ల సాయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నిధులను బాధితులకు అవసరమైన దుప్పట్లు, గుడారాలు, మందులు, ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తామని ఆ శాఖ ప్రకటించింది.

గత సోమవారం చైనాలోని పలు ప్రాంతాలను భారీ భూకంపం కుదిపేసిన విషయం తెల్సిందే. రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైన ఈ భూకంపం ప్రభావానికి పలు ప్రాంతాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మృతులు 20 వేలకు పైగా ఉన్నారు. వేలాది మంది గాయపడ్డారు.

లక్షలాది మంది నిరారశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో చైనా భూకంప బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. కాగా, భూకంప సహాయ చర్యల్లో సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మరిన్ని
జైపూర్ పేలుళ్లు: సైబర్‌కేఫ్ యజమాని అరెస్టు
కమ్యూనిస్టు వృద్ధ నేత ఆరోగ్యం విషమం
యూపీఏ మెతకవైఖరి వల్లే ఉగ్రవాదం: రాజ్‌నాథ్
తీవ్రవాదుల మతకల్లోల కుట్ర భగ్నం: పాటిల్
జైపూర్ పేలుళ్లు: పోలీసుల అదుపులో నలుగురు
దేశంలోని ముఖ్య నగరాల్లో హై అలెర్ట్