ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పృధ్వీ క్షిపణి పరీక్ష విజయవంతం  Search similar articles
భారత్ మరో మధ్యంతర క్షిపణి ప్రయోగాన్ని శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఒరిస్సా రాష్ట్రం, బాలాసూర్‌‌కు 15 కిలోమీటర్ల దూరంలోని చాందినీపూర్ సముద్రతీర ప్రాంతం వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) కేంద్రం నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై గల లక్ష్యాలను సులభంగా చేధించే ఈ మధ్యతరహా క్షిపణి పృధ్వీని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.

ఐటీఆర్ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. పృధ్వీ క్షిపణిని భారత రక్షణ మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవొ) తయారు చేసిందని, దీన్ని లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి మొబైల్‌లాంచర్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రయోగించినట్టు వివరించాయి. సుమారు 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం సామర్ధ్యం కలిగిన పృధ్వీ.. యుద్ధ సమయాల్లో ఆయుధాలను మోసుకెళ్లగలదని ఆ వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని
ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ఏర్పాటు
8-10 వారాల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం: కేంద్రం
సమైక్యంగా యూపీఏ పోరాటం: సోనియా
కాలం చెల్లిన వామపక్ష ప్రభుత్వం : మమతా
ఇంధన ధరల పెంపు ఆలోచనలో ప్రభుత్వం
ఎన్నికల్లో అధికార పక్షానికి పరాజయం : భాజపా